Tuesday, August 11, 2009

"బట్టీ" విక్రమార్కుడు

అప్పుడే టెంతు పాసయి ఇంటర్లో చేరాను.ఒక్క సారి గా నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయినట్లనిపించింది.అంతా కొత్తే,కొత్త కాలేజీ కొత్తగా పరిచయమయిన వ్యక్తులు,ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమయంలో నాకు ప్రతిదీ ఎంతొ కొత్త గా అనిపించటం గుర్తు.పల్లె టూరు నించి రావటం వల్ల టౌనులో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు,కానీ రోజూ ఇంటికి పోయిరావటం కుదరదు ఎందుకంటే ఫిజిక్సు కోటేస్వరరావ్ గారి క్లాసు ఉదయం ఆరుకి మొదలౌద్ది,ఆ వెటనే కెమిస్త్రి వెంకటెస్వరరావ్ క్లాసు ఏడుగంటలకి ఉంటుంది. కాబట్టి ఇంటికిపోయి రావటం కస్టమయిన పనే. క్లాసులో కొత్తగా పరిచయమయిన వాళ్ళలో కొంతమంది వేరే పల్లె నుంచి వచ్చిన వాళ్ళు ఉండటం గమనించాను.వాళ్ళలో రాజేష్ కూడా నాలాగే రూం కోసం వెతుకుతున్నాడని తెలిసింది. వెంటనే అతనితో రూం వేటలో పడిపోయాం, త్వరగానే రూం దొరికింది. అప్పటివరకు నాకు బయట ఉండి చదువుకునే అలవాటులేదు, మొదట కాస్త ఇబ్బంది అనిపించినా,ఆ వాతావరణం కొత్తగా అనిపించింది.రాజేష్ తో కొత్త బ్రమ్మచారి జీవితం మొదలయింది. రాజేష్ కూదా పల్లె హీరో కావటం వల్ల చిన్న విషయాన్ని కూడ పెద్దది చేసి చూసే వాడు.నేను దాదాపుగా అదే పరిణతిలో ఉన్నాను.అప్పుడే స్కూల్ నుంచి రావటం వల్ల రూము లో చిన్న విషయాలకి కూడా యుద్దాలు జరగటం మొదలెట్టాయి,మా ఒప్పందం ప్రకారం ఒకరోజు రాజేష్ ఒకరోజు నేను కూక్ చేయాలి,కానీ రాజేష్ కి ఎందుకో కూక్ చేయటం నామొషీగా ఫీల్ అయ్యే వాడు,అందుకే వాడి వంతు వచ్చినప్పుడు చక్కగా లేటుగా వచ్చే వాడు,నాకేమో బాగా ఆకలయ్యేది,చేసేదిలేక నేనే కూక్ చేసిపెట్టేవాడిని.ఆంతచేసి కూడా చేసిన తప్పు ఒప్పుకునే వాడుకాదు, దాంతో ప్రతిరోజూ ఆర్గుమెంటే నడిచేది, ఇక ఎక్కడి చదువు, ఎప్పుడో అటకెక్కింది.దాంతో ఎలాగయినా ఆ రూం నుండి బయటపడాలని డెసైడైపోయాను.మొదటి నుంచి నాకొక నమ్మకం ఉండేది,జరిగే ప్రతి పని ఏదో ఒక మంచి మలుపుకోసమే జరుగుద్దని,సరిగ్గా అదే టైములో మా నాన్న ఎంతో ప్రేమగా కొనిపెట్టిన రిస్టు వాచ్ రూంలో పోయింది,అసలే ఎడమొఖం పెడమొఖం గా ఉంటున్న మాకు ఆ వాచితో పూర్తిగా మాటలు కరువయ్యాయి,రాజేష్ తీసాడనే నమ్మాను,నిజానికి నా వాచ్ పోవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి,నేను ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉండవచ్చు,వెళుతూ ఉంటే జారి పోయి ఉండవచ్చు,రూం లోనే పక్కవాళ్ళు వచ్చి తీసుకొని ఉండవచ్చు,కానీ ఆ వయసుకి అంతకన్నా ఆలోచించలేక పోయాను. ఇప్పుడది గుర్తు చేసుకుంటే నన్ను నమ్మి నాతో పాటు రూములో చేరిన వాడిని అనుమానించినందుకు చాలాబాధ కలుగుద్ది.నేను ముందే చెప్పినట్లు నా కధ ఆ వాచ్తో కొత్త మలుపు తిరిగింది, నా వాచ్ పోవటమేమో గానీ నాకొక కొత్త రూంలో చేరే అవకాశం వచ్చింది.అదే సిటీలో మా పిన్ని కొడుకు కూడా చదువుతున్నడు,మా వాడు ఇంటెర్మీదెట్ సెకెండ్ ఇయర్ చడువు తున్నాడు.మొదటే వాళ్ళ రూంలో చేరటానికి అడిగాను,కానీ అప్పటికే రూములో ముగ్గురు ఉండటం వల్ల కుదరలేదు.అనుకోకుండా వాళ్ళ రూములో ఒకడు ఖాళీ చేసాడు.చందు ఆ అవకాశం కోసమే చూస్తున్నాడు,వెంటనే నన్ను వాళ్ళ రూముకి మారమన్నాడు.రాజెష్ తో చెప్పి అక్కడి నుండి బయటపడ్డాను.
రూంలో ఉండటం మొదలుపెట్టి కొద్దిరోజులే కావటం వల్ల,పెద్దగా లగేజీ లేదు,ఉన్న లగేజీ తో కొత్త రూం కి వెళ్ళే సరికి అప్పుడే చందు కాలేజీ నుంచి వచ్చాడు,నన్ను చూడ గానే పక్కనే ఉన్న వ్యక్తికి పరిచయం చేసాడు, అప్పటికే నా గురించి చెప్పడేమో తను మామూలుగానే రిసీవు చేసుకున్నాడు. అతనే బీరు, ఒహ్ సారి అది అతని ఇంటిపేరులో సగభాగం అందరూ ముద్దుగా బీరు అని పిలుస్తారు.లగేజీ అక్కడపడేసి వచ్చేసరికి చందు వేడి వేడి అన్నం వడ్డించాడు.స్యయం పాకంలో కూడా వాళ్ళు అన్నం చేసుకుంటున్నారు,పచ్చళ్ళు,కూరలు,పెరుగు లాంటివి వాళ్ళ ఊరినుండి వస్తాయి,అసలే ఉదయం లగేజీ సర్దడంలో టిఫిన్ మర్చి పోయానేమో బాగా ఆకలిగా ఉంది, ఇక ఏమాత్రం మొహమాటం పడకుండా వేది వేడి అన్నంలో అప్పుడే ఊరి నుంచి వచ్చిన తోటకూర పప్పు,వంకాయ కూర కొసరి కొసరి వడ్డించారు,నేనుకూడా మొహమాట పడలేదు కడుపు నిండా తిన్నాను.నాకా క్షణంలో అనిపించింది,ఇదీ …నా రూము, వీళ్ళు…నా స్నేహితులని.
మొదటి రోజే అయినా ఎందుకో నాకు ఆ రూములో ఎప్పటి నుంచో ఉన్నట్లుగా అనిపించింది.అదే బీరూ ని చూడటం,తను ఎక్కువ మాట్లాదే మనిషి కాదని అర్ధమయింది.డాదాపుగా నేను కూడ అదే కొవకు చెందటం వల్ల, త్వరలోనే బీరూ చాలా క్లొసయ్యాడు. మా చందు మాత్రం నోట్లో బస్సులు, కార్లు పెట్టుకున్నట్లు ఎప్పుడూ నోరు మెదపకుండా ఉండలేడు, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. మరికొద్ది సేపటికి వానర సైన్యం లాగా బిల బిలా కొంత మంది వచ్చి పడ్డారు,అందరి పరిచయాలు అయిపోయిన తరువాత అర్ధమయింది నేనుండబోయె రూము మామూలు ది కాదని.వాళ్ళలో ఒకడు సన్నగా నెడితే పడేటట్లున్నాడు, నన్ను దాదాపుగా రాగింగు చేసాడు, నాకయితే కడుపులో ఒకే గుద్దు తో నా కసితీర్చుకోవాలనిపించింది.నేను మరీ భయపడటం చూసి, దొండేటని పరిచయం చేసుకుని నన్ను కూల్ చేసాడు.పైకి వాళ్ళంతా చాలా అల్లరి మూకలాగా కనిపించినా వాళ్ళంతా కాలేజీ టాపర్లు.అందుకే అంటారుఎవరిగురించయినా తెలుసుకొవాలంటే ముందు వాళ్ళ ఫ్రెండ్సు గురించి తెలుసుకుంటే సరిపొతుందని.నాకు ఎక్కడలేని ఆనందం గా అనిపించింది, ఇక నిశ్చింతగా చదువుకోవచ్చని అనిపించింది.
* * *
సాయంత్రం ఆరౌతుంది ఎవరో బెల్లు కొట్టారు వెళ్ళిచూసాను బయట ఒక వ్యక్తి గాల్లో ఆలోచిస్తూ నిలబడి ఉన్నాడు,వెళ్ళి తలుపు తీశాను,తనువాసని వస్తూనే పరిచయం చేసుకున్నాడు,నాగురించి అడిగి తెలుసుకున్నాడు,కాసేపటి తరువాత అందరం టీ కి బయలుదేరాం,సాయంత్రం అవ్వటం వల్ల రోడ్డు మీద వాహనాల రద్దీ తగ్గింది,ఎక్కువ శాతం రోడ్డు నిలబడ్డ మనుషులతో నిండిపోయింది.నాకంతగా పరిచయం లేని సెంటర్ అది,వెళుతూ ఒక చోట ఆగిపోయారు,చందు నాలుగు ఆంలెట్.. ,నాలుగు బటానీ.. అని ఆర్డరేసాడు,జనరల్ గా మనం హోటల్ కి వెళితే హోటల్ వాడు ఆర్డర్ చేస్తాడు,కానీ ఇటువంటి బండ్ల దగ్గర కస్టమర్ ఆర్డర్ చేస్తాడు.మాటల్లో తెలిసింది అది జానీ మసాలా బండని,నేనుకూడా విన్నాను,అక్కడ ఆంలెట్ మసాలా బజ్జీ చాలా బాగుంటుందని,అన్నట్లుగానే తింటుంటే స్వర్గం కనిపించింది,ఆ టేస్టు ఎందుకో గానీ చిన్నప్పుడు నేను తిన్న ఉల్లిపాయ కారం వేసి చేసిన జొన్న రొట్టెని టేస్టుని గుర్తు చేసింది,బహుశా వాడు వాడిన మసాలా మహత్యం గాబోలు.ఆ తరువాత రసూల్ టీ సెంటర్ దగ్గిరకి తీసుకు పోయారు, నాలుగు చాయి ఆర్డర్ చేసారు అందులో మలాయి వేయమని చెప్పారు.ఆప్పుడే ఆంలెట్ తినటం వల్ల నోటి కారం టేస్టుకి వేడి,వేడి టీ నోటికి తగులుతుంటే చాలా హాయిగా అనిపించింది. రోజూ తాగే టీ ఈరోజు చాలా రుచిగా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది,నా ఒకటే అనిపించింది,నేను తాగుతున్న టీ కాదు నా చుట్టూ అల్లుకున్న కొత్త వాతవరణమే దీనికి కారణమని.
* * *

కొద్ది రొజుల్లోనే ఆ చుట్టూ ఉన్న మనుషులు, పరిసర ప్రాంతాలు అలవాటయిపోయాయి.మొదట్లో కొత్త ఫ్రెండ్సు బాగానే ఉంది గానీ రూంకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరగటం ఎక్కువయింది.ఏటయిములో చూసిన కనీసం అరడజను మంది బయటవాళ్ళు ఉంటున్నారు.దానికితోడు చందు,బీరు కూడ వాళ్ళతో ఎంజాయి చేస్తున్నారు,ఏదో అలా పుస్తకం పట్టుకుంటారు ఈలోగా ఎవరో పిలుస్తారు వెళ్ళి పోతారు.ఆది నాకొక పజిల్ లాగా తయారయింది,చూస్తేనేమో ఎప్పుడూ చదివిన పాపాన పోలేదు కానీ వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా ఉన్నట్లు అనిపించింది.నాకర్ధమయింది నేను వచ్చింది మంచి రూముకని సంబరపడి పోతే సరిపోదని,నాకు నేనుగా నా చదువు గురించి ప్లాను చెసుకోవాలని నిర్ణయానికి వచ్చాను.టెంతు తెలుగు మీడియం కావటం వల్ల నాకు ఒక సారి చదివితే గుర్తుండటం కస్టంగా ఉంది,కాదు అసలు ఎలా చదవాలో తెలియట్లేదు.వాళ్ళలాగ అలా ఇలా చదివితే సరిపోదని అనిపించింది.ఒకాసారి నేను అనుకున్నట్లు ప్లాను చేసుకున్నాక కాస్త రిలీఫ్ గా అనిపించింది.కానీ బాగా చదవాలన్న నా అతి కోరిక వల్ల నేను ఏవిధంగా నశ్టపోబొతున్ననో నాకా టైములో తెలియలేదు.ఏకాడికి బాగా చదవాలని అనుకుంటున్నానే తప్ప ఎలా చదవాలో ఆలోచించలేదు,నేనుకూడా వాళ్ళలాగ కాన్సెప్టుని అర్ధం చేసుకున్నట్లయితే నా పరిస్తితి వేరుగా ఉండేది,అలా ఆలోచించకపోవటం వల్ల బట్టీకి అలవాటు పడిపోయాను.ఇంటికి వెళ్ళి రెండువారాలు దాటింది,కాలేజీ అయిపొగానే ఇంటికి వెళ్ళిపొయాను,శని, ఆదివారాలు ఫ్రెండ్సుతో బాగా క్రికెట్ ఆడి ఎంజూయి చేసాను,దాంతో మండే కూడా కాలేజీకి పోవాలనిపించలేదు.


సాయంత్రం బయలుదేరి రూంకి వెళ్ళేసరికి రవీంద్ర వచ్చాడు.నేనడగకుండానే మొదలెట్టాడు,కాలేజీలో జరిగినదంతా చెప్పాడు,నిజానికి నే నారోజు కాలేజీకి పోకపొవటం వల్ల పెద్ద బండ నామీద పడింది,ఆరోజు క్లాసులో ఫిజిక్స్ కొటేస్వరాఉ అటమిక్ థీరీ చెప్పాడట,మామూలుగానే ఆయనకి కొపం ముక్కు మీదనే ఉంటుంది,ఆరోజు క్లాసులో ఎవడో వెనకనుంచి గుర్రంలాగ సకిలించాడు దాంతో ఆయనకి బాగా మండింది,కక్ష సాధింపు చర్య గా ఈరోజు చెప్పిన లెసన్ మీద క్లాసులో రేపు టెస్టు పెడతానన్నాడట.ఈ వార్త వినంగానే నా పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించింది. అసలే ఎలా చదవాలో అర్ధం గాక చస్తుంటే, ఇప్పుడేమో క్లాస్ అటెండవకుండానే చదవాలిప్పుడు.ఆ రోజు సాయంత్రం వంట చేయటం నావంతు గాబట్టి త్వరగా పూర్తి చేసుకొని,పుస్తకాలు ముందేసుకున్న,చాలా చదవాలని ఆరాటం కానీ కొంచెం కూడా లోపలికి వెళ్ళటం లేదు.నా అవస్త చూసి బీరు అడిగాడు ఏం చదువుతున్నావని, చెప్పాను రేపు కాలేగీలో టెస్ట్ గురించి, అందుకే కుస్తీ పడుతున్నాని చెప్పాను,బీరూకి నేనారోజు కాలేజీకి వెళ్ళలేదని తెలుసు, బీరు తో పాటు చందు,బక్క సీను కూడా అక్కదే ఉన్నాడు. నా మాటలకి వాళ్ళు పడి పడి నవ్వారు,బక్క సీనయితే మరీనూ.వాళ్ళు నవ్విన నవ్వులు ఇప్పటికీ నేను మర్చిపోలేను.వాళ్ళ నవ్వులేమో గానీ నాకావిధంగా బట్టీ పట్టడం పొరపాటున అలవాటుగా మారిపోయింది.ఆ రోజు నుంచి మా రూము దగ్గిరలో గబ్బిలాలు తిరగటం మానేసాయి,నేను చదివే సౌండుకి,ఆ చుట్టుపక్కలకి రావటం మానేసాయి. నా ఫ్రెండ్ కైలాష్ అంటుండేవాడు నేను చదివే టప్పుడు విన్నది గుర్తుపెట్టుకొనే చాలా మంది పాసయిపోయారని.
* * *
ఎండ్లాకాలం అవటం వల్ల పగలే కాకుండా రాత్రిపూట కూడా చాలా వేడిగా ఉంటుంది, మేముండే రూము ఫస్టు ఫ్లోరులో ఉండటం వల్ల చల్లగా, హాయిగా ఉంటుంది. అందుకేనేమో, చందు,బీరు వాళ్ళ ఫ్రెండ్సు అతి సాధారణంగా వచ్చి నైటు స్తడీ చేసుకుని అక్కడనే పడుకునేవారు. చదువు అన్న వంకే గానీ ఎప్పుడూ సినిమా కబుర్లే సరిపోయేవి, ముక్యం గా పాలపర్తి వస్తే మాత్రం మిగిలిన వాళ్ళు నోరు మూసుకొని వినటం తప్ప చేసేది ఎమీలేదు, నోరు విప్పితే అన్నీ సినిమా కబుర్లే . సరిగ్గా మా రూంకి సమానంగా పక్కవీధిలో సంధ్యా వాళ్ళ ఇళ్ళు ఉంది, ఇంతకీ సంధ్య ఎవరో చెప్పలేదు కదూ, సంధ్యా మా కాలేజీలోనే చదువుతుంది, చాలా అందంగా ఉంటుంది, మా క్లాసులో ఆ అమ్మయితో మాట్లాడటానికి తెగ ఇదయిపోయే వాళ్ళు, ఎంతంటే, ఆమె దగ్గిర నోట్సు తీసుకోవటానికి వంకకోసం క్లాసు డుమ్మ కొట్టేవాళ్ళు. అటువంటి అందాల రాసి మా రూంకి దగ్గిరలో ఉండటం ఎంత ప్రమదమో త్యరలోనే తెలిసొచ్చింది..
రోజుట్లాగానే త్వరగా డిన్నర్ ముగించుకుని, పుస్తకాలు పట్టుకున్నాను, అప్పటివరకు ఆ చుట్టుపక్కల తిరుగుతున్న గబ్బిలాలు ఒక్కసారిగా మాయమయ్యాయి, సెకెండుషొకి వెళ్ళిన మా కిష్కింద మూక బిలబీల్ మంటూ దిగిపోయారు, మొత్తం పదిమందికి పైనే ఉన్నారు, ఎవో సినిమా కబుర్లు చెప్పుకుంటూ చిన్నగా నిద్రలోకి జారుకున్నారు, అప్పతికే టైము ఒకటి దాటింది నాకు కూడా అనిపించి అలా చదువుకుంటూ నేను కూడా నిద్రపోయాను, అప్పుడే నిద్రపడుతుంది సడన్ గా పెద్ద పెద్ద గా అరుపులు వినిపించాయి, వెయ్యండిరా ఒక్కొకడిని … తన్ని ఒక్కొక్కడిని కార్లో ఎక్కించండి.. అంటూ అరుస్తున్నారు, ఒక్క సారి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పోలీసులు లాటీలతో మా వీపు విమానం మోత మోగించటానికి రెడీ ఔతున్నారు, ఆ దెబ్బకి ఒక్కసారి అందరికీ నిద్ర మత్తొదిలింది. భయంతో హడావిడిగా లేచేసరికి కొంతమందికి లుంగీలు పోయాయి, అదరాబదరాగా దుప్పట్లు చుట్టుకున్నారు, మా వాసు గాడు ఇటువంటి టయిములో షార్ప్ గా ఆలోచిస్తాడు, లాయరు ద్వారా మందస్తు బెయిలు తెచ్చుకున్నట్లు, తనకి జాండీసు వచ్చిందని,కావాలంటే కళ్ళలోకి చూడమని,కొట్టగూడదని చెపుతున్నాడు,పాలపర్తి మామూలుగా అయితే పక్కవాడిని నోరు ఎత్తనివ్వడు,కానీ ఇప్పుడు ఎదురుగ్గా ఉంది పొలీసులు,ఏం మాట్లాడాలో తెలిక ఊడిపోయిన లుంగీ సర్దుకుంటున్నడు,అంతా ఏదొవిధంగా వాళ్ళ లాఠీ దెబ్బలనుండి తప్పించుకోవటానికి నానా అవస్తలు పడుతున్నారు.ఏవ్వరికీ అర్ధం గాని ప్రశ్న ఒక్కటే, అసలు పోలీసులు ఎందుకొచ్చారని. ఏంటి ఎవరయినా దొరికారా అంటూ అప్పుడే పైకి వస్తున్నాడు యస్సై, అంతమంది ని చూసే సరికి ఆ హా దొరికారా నా … అనుకున్నాడు, ఎవరు వీళ్ళంతా?, ఈ రూంలో ఎంతమంది ఉంటునారంటూ నిలదీసాడు, చందూ చెప్పొకొచ్చాడు,మా రూములో ఎంతమంది ఉంటుందీ,మిగతావారు ఎలా వచ్చిందీ, యస్సై చందూ మాటలు వింటూనే మా రూములో కింద ఫ్లోరు మీద ఏవయినా రాళ్ళు ఉన్నాయేమో చూస్తున్నాడు, రూం అవతలగా పోయి ఎదురుగ్గ అవతల వీధిలో ఉన్న సంధ్య వాళ్ళ ఇంటివైపు చూసాడు, తలకాయ అడ్డంగా ఆడించాడు, ఏమి అర్తమయిందో ఎమో గానీ వెంటనే మిగతా కానిస్టేబుల్సుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక్క సారి తుఫాను వెలిసినట్లయింది.


ఆ హడావిడికి చుట్టుపక్కల వాళ్ళుకూడా లేచారు,ఎప్పుడూ లేవని మా ఒనరుతో సహా.పొలీసులు మా రూము ఒనర్సుతో ఎదో మాట్లాడారు,మా ఒనరు మా వైపు చేతులు చూపిస్తూ ఎదో చెప్పాడు,ఆయనకి షేక్ హండిచ్చి పోలీసులు వెళ్ళిపోయారు.మా రూము ఓనరు పైకి వచ్చాడు, అప్పటికే ఆ ఖంగారునుండి బయటకి వచ్చారు అంతా, మా ఓనను జరిగినదంతా చెప్పాడు.విషయమేమిటంటే ఆ ఎదురుగ్గా ఉన్న సంధ్యా వాళ్ళ ఇంట్లో వారంలో రెండుమూడు సార్లు గంపెడు రాళ్ళు పడుతున్నాయట,అన్ని రాళ్ళు ఎలా పడుతున్నయొ ఎక్కడినుంచి పడుతున్నయో ఎలా పడుతున్నయో తెలియక వాళ్ళు భయపడిపోయి పోలీసు కంప్లైంటు ఇచ్చారు,ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగిపోయారు,అలా వెతుకుతూ వచ్చి మా రూం మేద దాడిచేసారు.మేం చెసినతప్పల్లా రూంలో ఆ టైములో లైటు వేసి చేసి ఉండటమే,ఆ లైటు చూసి మా రూములో వాలిపోయారు.అద్రుష్టం కొద్దీ మా రూములో రాళ్ళు కనిపించకపోవటం ఒకటి, ఆ యస్సైకి ఎందుకో అంత దూరం నుండి రాళ్ళు వేయటంలో నమ్మకం కుదరలేదు,ఆ యస్సై నమ్మకమే మాకు శ్రీరామ రక్ష అయింది,అదే మాట చెప్పి మా ఓనరు వెళ్ళిపోయాడు. అందరికీ అర్దమయిన విషయమేమిటంటే ఆ పోలీసుల రాకకి కారణం నేను అప్పటిదాక చదువుకోవటమేనని,వాళ్ళు చూసిన చూపుకి నా అద్రుశ్టం కొద్ది వాళ్ళ చూపుకి భస్మం చేసే పవర్ లేదు గానీ లేకపోతే నా బూడిద గూడా దొరికేది గాదు.నేనక్కడ ఒక్క మాట మాట్లాడినా అందరు కలిసి కుమ్మేటట్లున్నారు,అంతే.. కుక్కిన పేనులా ముసుగుతన్ని పడుకుండిపోయాను, అందరూ వంతులవారీగా బాత్రూంకి వెళ్ళొచ్చారు,నా గజిని బుర్రకి రెండ్రోజులు పట్టింది అందరూ బాత్రూంకి ఎందుకు వెళ్ళారో అర్దమవటానికి, ఆ తరవాత ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా హాయిగా నవ్వుకునేవాళ్ళం.

Saturday, May 2, 2009

అమ్మా నాన్నా ఓ తెలుగబ్బాయి

రేవంత్ కి చాలా అసహనం గా అనిపించింది. ఒక సారి వాచ్ వైపు చూసుకున్నాడు, 9 అవుతుంది అంటే తను వెళ్ళవలసిన చోటు చేరుకోవటానికి ఇంకా మూడు గంటలు సమయముంది, కానీ ఎక్కడో చిన్న డవుటు సమయానికి చెరుకొగలనా లేదాని. మొదటిసారి రేవంత్ కి అనిపించింది మనిషికి రెక్కలుంటే బాగుండని ఎంచక్కా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చని, చేసేదిలేక అసహనంగా అలా పేపరు చదువుతూ కూర్చుండిపోయాడు. నిజానికి రెవంత్ కి ఈరోజు చికాగో లో ఒక పెద్ద కంపనీలో ఇంటర్వూ ఉంది, వాతావరణం సరిలేకపోవటం వల్ల తను బయలుదేరవలసిన ఫ్లయిటు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది,అందుకే రేవంత్ ఫ్లయిటు వేగం కంటే ముందుగా ఆలోచిస్తున్నాడు.తను ఈరోజు అటెండవబోయే ఇంటర్వూ పాస్ చేయగలిగితే తన శాలరీ ఒక్కసారిగా డబుల్ అవుతుంది,ఈ అలోచనే తనని సీటులో కుదురుగా కూర్చోనీయటంలేదు. రేవంత్ అమెరికా వచ్చి సరిగ్గ ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతుంది, ఈ ఆరేళ్ళలో ఎన్నో కంపనీలు మారాడు, అలా మారిన ప్రతి సారి తన శాలరీ పెరుగుతూ వచ్చింది.రేవంత్ కంపనీ మారిన ప్రతిసారి ఇళ్ళు మారవలసి వచ్చేది ఒక్కోసారి ఊరుకూడా మారవలసి వచ్చేది.శాంతి కి అప్పుడు చాలా కస్టంగా అనిపించేది, ఒక పక్క కొడుకు ఆర్యని చూసుకొవటం ఇళ్ళు సర్దుకోవటం చాలా కస్టమనిపించేది,కానీ రేవత్ మనసు తెలిసిన భార్య గా తను ఎప్పుడు తన బాధల్ని ఎప్పుడూ తనతొ పంచుకోలేదు , ఒకవేళ చెప్పినా తనకి ఎదురయ్యే సమాధానం తెలుసు. ఆందుకే తనే సుర్దుకుపోతుంది. శాంతి ఎప్పుడూ ఒక్క విషయం గురెంచే ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకు రేవంత్ లో ఇంత మార్పు వచ్చింది , తమ పెళ్ళినాటి రేవంత్ కి ఇప్పటి రెవంత్ కి చాలా మార్పు గమనించింది. తను ఇప్పుడు అంతా దబ్బు తోనే చూస్తున్నడు, ఏమి మాట్లాడినా డబ్బు అన్న మాట దొర్లకుండా ఉండదు. ఆమెరికా వచ్చినదగ్గిరనుంచి తమ లైఫ్ అంతా మంచు లోనే గడిచిపోయింది. అసలే అమెరికాలో మనిషికి మనిషి సంబంధమే ఉండదు, అందునా ప్రతి ఆరు నెలలకొకసారి కంపనీ మారటం వల్ల తెలిసిన వారంటూ లేకుండా పోయారు, డెట్రాయిట్ లాంటి మంచు వాతావరం లో ఉండటం తెలిసినవాళ్ళు లేకపోవటం వల్ల ఆర్య కి మూడు సంవట్సరాలు వచ్చినా మాటలు ఇంకా పూర్తిగా రాలేదు. ఆసలు వాడు మాటలు నేర్చుకోవాలంటే బయట ప్రపంచం చూస్తేకదా, రేవంత్ కి ఇఎవేమె పట్టవు , తన ఆలోచనంతా ఎలా ఎక్కువ సంపాదించాల అని ఉంటుంది, ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు రేవంత్ పుట్టిన రోజు, అదిగూడా గుర్తులేనంతగా ఆలోచిస్తున్నాడు, ఏంటి ఈ డబ్బు మనిషిని ఎంతగా మారుస్తుందా ….

ఈ రోజు రేవంత్ ఉదయాన్నే బయట పడే సరికి శాంతి కూడా ఆర్యాని నిద్రలేపి త్వరగా రెడీ చేసి తన పనులలో మునిగిపోయింది.

* * *

అనుకున్నట్లుగానే రేవంత్ ఫ్లయిటు కాస్త ఆలస్యంగా చికాగో చేరుకుంది ,అందరికంటే ముందుగా దిగి ప్రపంచం ఆగిపోతున్నట్లు రేవంత్ పరెగెత్తుకుంటూ వెళ్ళి క్యాబ్ లో కూర్చున్నాడు,తను అనుకున్న దానికంటే 30 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు. రేవంత్ ఊహించిన విధంగానే ఇంటర్వూ పాస్ చెసాడు, IBM కంపని లో పెద్ద పోస్టు దానికి తోడు పెద్ద శాలరీ, రేవంత్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే తన తోటి కొలీగ్స్ కి ఫొన్ చెసి ఈ షుభవార్త షేర్ చేసాడు.రేవంత్ ఆనందం రెట్టింపయింది. తనకి పెరిగిన శాలరి గురించి కంటే , తనకి పెరిగిన శాలరీ ని వాళ్ళతో షేర్ చేసినందుకు ఎక్కువ ఆనందం కలిగింది.శాంతి కి కాల్ చేసి మాట్లాడాడు, తన ఆఫెరు గురించి , తాము ఉండబోయె హౌసు కూడా చూసినట్లు చెప్పాడు ,తను వచ్చే సరికి రాత్రి 9 అవుతుందని చెప్పాడు. శాంతి కి అర్దమయిపోయింది మళ్ళీ సర్దడం మొదలు పెట్టాలని.శాంతి ఆర్యాకి స్నానం చేయించి అన్నం పెట్టి పడుకోపెట్టే సరికి 9 అయింది,హాలులోకి వస్తుండగా డోరు బెల్ మోగింది, శాంతి తలుపు తీసింది , రేవంత్ వచ్చాడు, వస్తూనే కొడుకు గదిలోకెళ్ళి నిద్రబోతున్న ఆర్యాని ముద్దాడాడు. చెక చెకా స్నానం చేసి వచ్చేసరికి శాంతి వడ్డించింది.శాంతి చాలా రకాల వంటకాలు చేసింది.అవి చూసిన తర్వాత గానీ గుర్తుకు రాలేదు ఈ రోజు తన పుట్టినరోజని..

* * *

రామనాధం గారు ఆరుబయట వాలు కుర్చి వేసుకుని పడుకుని ఉన్నారు . ఎందుకో పదే పదే ఇంటి లోపలికి చూస్తున్నాడు,చప్పుడేమీ రాకపోయేసరికి చిన్న నిట్టూర్పుతో మళ్ళి కుర్చీలో సర్దుకొని కూర్చుంటున్నారు. ఏంతసేపు ఎదురు చూసినా లోపలనుంచి సుశీలమ్మ బయటకి రావటంలేదు, ఈమె ఎప్పుడూ ఇంతే , ఎప్పుడూ ఏదో ఒకటి సర్దుతూ ఉంటుంది అంటూ సుశీలమ్మ బయటకి రానందుకు విసుక్కున్నాడు.తనతో చాలా మాట్లాడాలనుకున్నాడు. రేవంత్ గుర్తుకు వచ్చాడు, ఈటైములో వాళ్ళు ఎంచేస్తుంటారో, రేవంత్ ఆలోచన రాగానే మనసంతా ఆలోచనలతో నిండిపోయింది , ఒక్కసారి రేవంత్ తో గడిపిన ఆనంద క్షణాలు గుర్తుకు వచ్చాయి, ఆ వెంటనే తను వాడిని మిస్సౌతూ పడే బాభ గుర్తుకు వచ్చింది.వాడు ఇంతకముందులాగ తమతో మాట్లాడటం లేదు,ఎప్పుడయినా వాడికి చేయాలనిపించినప్పుడు మాత్రమే ఫొన్ చేస్తున్నాడు.కన్న కొడుకుని చూడాలని మనసుపడే బాధ ఒక్క కన్న తల్లిదండ్రులకి తెలుస్తుంది గాని కన్న కొడుకు కూతుర్లకి ఎప్పటికీ తెలియదు. ఆలా ఆలోచనలలో పడి పడక కుర్చీలో వాలిపోయాడు.సుశీలమ్మ ఇల్లు సర్దుకొని వచ్చేసరికి మాస్టారు నిద్రపోతూ కనిపించారు.తనకి కూడా ఆరోజు పని ఎక్కువ కావటం మూలాన అప్పటికే వేధిస్తున్న మోకాళ్ళ నొప్పులు ఇక ఏమాత్రం కదలడానికి వప్పుకొవటం లేదు, అతి కస్టం మీద ఇద్దరి మంచాలు వేసి అలా నడుం వాల్చింది, బాగా పని వత్తిడి వల్ల వళ్ళంతా నొప్పులుగా ఉంది, అలా నులక మంచం మీద పడుకునే సరికి నులక గరుకు దనం,బొంత మెత్తదనం కలిసి చాలా హాయిగా అనిపించింది , అలానే పడుకునిడి పోయింది,తల పైన ఇంటి కప్పుకి అంటిపెట్టుకున్న సీలింగ్ ఫాన్ వీధి లైటు కాంతిలొ మినుకు మినుకు మని మెరుస్తూ తిరుగుతుంది.అలా తిరుగుతున్న ఫానుని చుస్తూ తను కూడా ఆలొచనలలో మునిగి పోయింది....

* * *


రామనాధం గారు పేపరు పట్టుకొని దాదాపు పడిపోతున్నట్లుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు,అది చూసి సుశీలమ్మ గాబరా పడ్డది ఏంటి ఏమయిందంటూ ఇంట్లొనుంచి బయటకి వచ్చింది.ఆయన మొఖం లొ అంతటి ఆనందం చూసి చాలా రోజులైంది. రామనాధానికి ఆనందంతో మాటలు రావటం లేదు, అతికష్టం మీద ఆనందాన్ని అణుచుకుంటూ తన చేతిలొ ఉన్న పేపరు చూపించాడు.సుశీలమ్మ గారి ముఖం లో కూడా అనందం వెల్లివిరిసింది, ఆ కన్న మనసు ఆనందం తో కళ్ళు చెమర్చాయి, ఈ రోజు పేపరు లో తన కొడుకు ఫోటో వేసారు,తన కొడుకు యం సెట్ పరీక్షలొ రాష్ట్రం మొత్తం మీద మొదటి రాంకు సంపాదించాడు,అందుకే వాళ్ళిద్దరూ ఆ వార్త చూసేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి ఔతున్నారు.రామనాధం పరుగు మీద ఇంకా నిద్ర పోతున్న కొడుకుని నిద్ర లేపటానికి పరుగు,పరుగున ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటికే ఊళ్ళో చాలా మందికి ఆ వార్త తెలిసిపోయింది,ఒక చిన్న పల్లెటూరు నుంచి అటువంటి ఘనత పొందినందుకు, పైగా ఇది సాధించింది తమ మిత్రుడు, రామాపురం మాస్టారుగారి కొడుకు ఐనందుకు ఈ ఘనత మొత్తం ఊరికే గర్వకారణమని అందరూ కొనియాడారు.ఇంతటి విజయాన్ని సాధించినందుకు రేవంత్ ని ఆ తల్లిదండ్రులు ముద్దులతో ముంచెత్తారు.రేవంత్ తల్లిదండ్రుల దగ్గిర ఆశీర్వాదం తీసుకొని,ఈ సంతొషాన్ని స్నేహ బ్రుందంతో పంచుకోవటానికి బయటకి పరుగు తీసాడు.రేవంత్ చిన్నప్పటి నుంచి కూడ తల్లి దండ్రులన్నా బంధువులన్నా ఎక్కువ ప్రేమాభిమానాలు చూపేవాడు, తండ్రి స్కూల్ మాస్టారు కావటం వల్ల కూడా మంచి అభిరుచి, అలవాట్లు అలవడ్డాయి. మొదటి ర్యాంకు కావటం వలన రేవంత్ కి హైదరాబాదు లో చదవటానికి అవకాశం వచ్చింది , హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో చేరాడు.

* * *
మొదటి సారి తమ ఊరు వదలి వెళ్ళి చదువుతుండటం వల్లేమో,వాడికి హైదరాబాదు కొత్త చేసింది.దాంతో నెలకి ఒక్క సారయినా ఇంటికి రాకుండా ఉండేవాడు కాదు,అలా నెమ్మదిగా అలవాటు పడి పొయాడు, ఇప్పుడు ఆరు నెలలకి ఒక్కసారి వస్తున్నాడు . చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గదిచిపొయాయి, రేవంత్ ఈ నాలుగు సంవత్సరాలలో చాలా ఎదిగిపొయాడు, చాలా విషయాల మీద పట్టు సంపాదించాడు. జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరాలనే కొరిక పెంచుకున్నాడు,అతని ఆలోచనలకి తోడుగా ఇండియాలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చ్చాయి, ఉద్యొగం కొసం వెతికే అవసరమే లెకుండా పోయింది, ఏన్నో కంపెనీలు కాలేజి కాంపసు కి వచ్చాయి, రేవంత్ మొదటి గా వచ్చిన IBM కంపెనీలో చేరాదు, నెలకి మూడు లక్షలు బెంగులూరులో ఉండాలి.ఈ వార్త అమ్మా నాన్నకి ఫొను చేసి చెప్పాడు, కొడుకు చేతికంది వచ్చినందుకు రామనాధం, సుశీలమ్మలు చాలా పొంగిపోయారు.త్వరలో వాళ్ళ కష్టాలు తీరబొతున్నందుకు వాళ్ళు ఎంతగానో ఆనందపడిపొయారు.రామనాధం ఒక విషయాన్ని గమనించాడు,తన స్కూల్ మాస్టారు ఐనప్పటికీ తను ఎప్పుడు గూడా అమ్మ నాన్నలకి దూరంగా ఉండింది లేదు,ఒక్కోసారి ట్రాన్స్ఫర్ కారణంగా ఇరవయి మైళ్ళ దూరం వెళ్ళవలిసి వచ్చేది అటువంటి సమయంలో కూడా తను ఎన్నడూ తన తల్లిడంద్రులకి దూరం పోయిందిలేదు. అదెంటో సాయంత్రం అయ్యేసరికి నాన్నని చూడ కుండా ఉండలేకపోయేవాడు,కాని ఇప్పుడు తన కొడుకు చదువు కోసం నాలుగు సంవత్సరాలు తనకీ,సుసీలకీ దూరంగా ఉందవలసి వచ్చిందికానీ వాడు ప్రతి పండుగకీ లేదా ప్రతి నెలకీ రావటం వలన తనకి కూడా పెద్ద బాధ అనిపించలేదు, కానీ ఇప్పుడు బెంగుళూరు కి మారిపోతున్నాడు,కొడుకు తమకి దూరంగా ఉందవలిసి రాబోతుందని ఊహించాడు,తమ నుంచి రేవంత్ ని ఎవరో దూరం గా తీసుకుపోతున్నట్లుగా ఫీల్ అయ్యాడు .కానీ మళ్ళీ అనిపించింది తన కొడుకు ఇన్నాళ్ళ చదువుకి తగ్గ ప్రతిఫలం పొందబోతున్నాడు, అయినా నాకు చూడాలిపించినప్పుడు నేను వెళ్ళొచ్చు లేదా వాడినే రమ్మని చెప్పొచ్చు అయినా అనుకొవటానికిగానీ వెళుతుంది వాడేమయినా అమెరికానా?

* * *

అనుకున్నట్లుగానే కొదుకు బెంగుళూరులో చేరాడు మొదట్లో రేవంత్ ప్రతినెలా ఊరికి వచ్చేవాడు, పోను పోను రేవంత్ తన జాబులో బిజీ అయాడేమో ఊరికి రావటము తగ్గింది.రామనాధానికి తన కొడుకు కస్టపడుతున్నాడని అర్ధమయింది,రేవంత్ కి పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టాడు.కొద్దిరోజుల్లోనే హైదాబాదులో ఉంటున్న శాంతి తో పెళ్ళి కుదిరింది.శాంతి వాళ్ళ ఫామిలీ తో ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయి, తెలిసిన వాళ్ళూ కావటం వలన రామనాధం,సుసీలమ్మలు అనందపడ్డారు.రేవంత్ తన పెళ్ళి చాలా వైభవంగా చేసుకున్నాడు,బెంగుళూరులో ఒక మంచి ఇళ్ళు అద్దెకి తీసుకొని తమకి కబురు చేసాడు.మొదటిసారి రెవంత్ ఫామిలీ పెడున్నాడు కనుక తను వెళితే కాస్త సహాయంగా ఉంటుందని సుశీలమ్మతో కూడా వెళ్ళాడు.అదే మొదటి సారి తను బెంగుళూరు వెళ్ళటం, చాలా చలిగా అనిపించింది,అక్కడ ఉదయం పదివరకూ ఒక్కడూ బయటకి రావటంతను చూడలేదు.నాలుగు రోజుల్లో పనులన్నీ చక్కబెట్టి సుశీలమ్మతో మళ్ళా తమ ఊరికి వచ్చేసారు.ఊర్లో అడుగుపెట్టగానే ఒక్క సారి ఊపిరి వచ్చినట్లనిపించింది. అదెంటో గానీ అలవాటయిన బయట అరుగుమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వచ్చే ఆ ఆనందం మరెక్కడకెళ్ళినా రాదనిపించింది.అందుకే నేమో అంటారు అమ్మ ప్రేమ,సొంత ఊరి గాలి,చిన్ననాటి స్నేహితుడు ఎన్నటికే మరువలేనివని.సంక్రాంతి రెండులెలలో ఉండటం వల్ల,శాంతి వాళ్ళు ఒకేసారి సంక్రాంతికి రావటానికి నిర్ణయించుకున్నారు.ఎప్పుడయితే మనకి రోజులు నిమిషాలలాగా దొర్లుతుంటాయో దానికి కారణం ఒకటే, మనకి ఎటువంటి కష్టాలు,ఇబ్బందులు లేకపొవటమే.రామనాధం గారి పరిస్తితి అలానే ఉంది, అలా చూసేలోగా సంక్రాంతి రానే వచ్చింది. కొత్త పెళ్ళికొడుకు,పెళ్ళి కూతురు తో వాళ్ళ ఇళ్ళు కళకళ ళాడింది, పైగా వాళ్ళ పెళ్ళీ తరవాత వచ్చిన మొదటి పండగ.పండగ మూడురోజులు చాలా అనందంగా గడిచింది.రేవంత్ వాళ్ళ ఊరువెళ్ళే ముందు రాత్రి అందరూ కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు,రేవంత్ ఏదో తనకి చెప్పటానికి ఇబ్బంది పడుతున్నాడని తండ్రి గమనించాదు. రామనాధం కొదుకుని అదే అడిగాడు,రేవంత్ ఇక దాచటం ఇష్టం లేక చెప్పాడు, తను అమెరికా వెళ్ళబోతున్నామని,కొన్ని సంవత్సరాలు అక్కదే ఉండాలనుకుంటునట్లు. ఇప్పుడిప్పుదే రామనాధం,సుసీలమ్మలు దూరంగా ఉంటున్న కొడుకు పెళ్ళి సందడితో కాస్త మరిచిపోయి కుదుటపడుతున్నారు ఈలోగా ఇటువంటి గుండెల్ని బాధించే వార్త వినవలసి వస్తుందని ఊహించలేదు, కాని వాళ్ళూ తన కొదుకుకి ఆ బాధని కనపడనీయ కుందా జాగర్త పడ్డాడు.ఒక్కసారి వంట్లో ఉన్న శక్తినంతా ఎవరో తోడేసినట్టుగా అయిపోయింది వాళ్ళకి,అప్పటివరకు చాలా ఉత్సాహంగా అనిపించిన రోజులు ఒక్కసారిగా మసక బారిపోయినట్టయింది.ఆ తరువాత రోజు రాత్రి రేవంత్ శాంతి వెళ్ళిపోయారు. అనుకున్నట్లుగానే రేవంత్ శాంతి లు నెల తిరక్కుండానే అమెరికా వెళ్ళిపోయారు.ఆ రోజు మొదలుకుని రామనాధం గారిలో చాలా మార్పులు చోటుచేసున్నాయి.ఇంతకిముందు ఊరువిషయాలు,పనులలో చాలాచక్కగా కల్పించుకునేవాడు.ఇప్పుడు ఆ ఉత్సాహం ఏమయిందో తెలియదు, ఎదో దిగాలుగా ఉండిపోవటం, మాటలు కూడా తగ్గిపోయాయి, ఎప్పుడూచలాకీగ మాట్లాడేఆయన,నలుగురిలోఉన్నాలేనట్లుగామవునంగా కూర్చుండిపోతున్నారు. ఆయన అలా ఉండటం సుశీలమ్మకి ఇన్నాళ్ళ తన జీతంలో ఎన్నడూ చూడలేదు.

* * *

అప్పుడే తన కొడుకు పెళ్ళయి ఆరు సంవత్సరాలయింది.మనవడు పుట్టికూడా రెండు సంవత్సరాలయింది.వాడిని ఫొటోల్లో చూడటమే గాని ఇప్పటికీ కళ్ళారా చూడలేకపోయారు.ఎన్నో సార్లు కొడుకుకి చెప్పింది తనకి,వాళ్ళని ఎంతగానో చూడాలనిపిస్తుందని,తిరిగి ఇండియా వచ్చేయమనీ.అడిగిన ప్రతిసారి ఎదో ఒక సమాధానం చెప్పి మాట మర్చిపోయేలా చేసేవాడు.తన కొడుక్కి తమ మీద ప్రేమ కన్నా తన సంపాదన పైనే ప్రేమెక్కువ ఉన్నందుకు బాధపడ్డది. ఎందు కంత డబ్బు మీద మమకారం పెంచుకున్నాడో,ఎందుకు ప్రేమ,అనురాగాల మీద మమకారం తగ్గించుకున్నాడో అర్ధం కాలేదు.తన కొడుకేంమిస్సౌతున్నడో తమకి తెలుస్తుంది, కానీ వాడికెలా తెలియాలి?. భగవంతుడా..!
చిన్నపాటి శబ్దం తో సుశీలమ్మ కి మెలుకువ వచ్చింది.అప్పటికే భళ్ళున తెల్లారి పోయింది,రామనాధం గారు పేపరు చదువుతూ కనిపించారు.సుశీలమ్మగారిని చూస్తూనే తన ముఖంలో ఎదో బాధని గమనించాడు, బహుసా కలత నిద్ర అయి ఉండ వచ్చని సరెపెట్టుకున్నాడు.కాఫీ పెట్టమని అడిగారు.దేనికోసమో పేపరు చదువుకుంటూ పదే పదే ఇంట్లోకి చూస్తున్నడు,కాఫ్ఫీ కప్పు చెతికిస్తునే సుశీలమ్మకి గుర్తుకి వచ్చింది,ఈ రోజు రేవంత్ పుట్టిన రోజు,అందుకే రామనాధం గారు తన కొడుకు ఫొను కోసం పదే, పదే చూస్తున్నడు.సుశీలమ్మ కి ఎమాత్రం నమ్మకం లేదు,అమ్మా నాన్నలతో మాట్లాడటం వాడికున్న సవా లక్ష పనులలో అది ఒకటి వాడికి.అలా రామనాధం చాలా సేపు ఎదురు చూసాడు, కానీ రేవంత్ దగ్గరినుంచి ఫోను మాత్రం రాలేదు.అలా రామనాధ గారు రాత్రివరకు కొడుకు ఫొను కోసం చూస్తూనే ఉన్నారు,ఇక ఎప్పటికీ రాకపోయెసరికి, ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఇంట్లోకి వెళ్ళాడు వస్తూ ఒక పెన్ను, పేపరు తెచ్చుకున్నారు, ఆరు బయట పడక కుర్చీ వేసుకొని ఎదో రాయటం మొదలెట్టాడు,అలా చాలాసేపు రాసాడు,కొద్దిసేపటి తరువాత రాసినదానివయిపు ఒక్క సారి చూసుకొని సంత్రుప్తిగా లేచాడు. ఇంట్లోకి వెళ్ళి డయరి తీసి అందులో రేవంత్ అమెరికా అడ్రసు రాసి ఉంది,కవరు మీద ఆ అడ్రసు రాసి, తన దగ్గిరున్న స్టాంపుల్ని అమెరికా వెళ్ళటానికి సరిపడా అంటించ్చాడు ఒంకెన ఉన్న చొక్క వేసుకొని బయలుదేరాడు, వెనుకనుంచి సుసీలమ్మ కేక వేసింది ఈటైములో ఎక్కడికివెళుతున్నారని,రామనాధం వినిపించుకొకుండా వెళ్ళిపోయాడు.

* * *

రేవంత్ చాలా బిజీ అయిపోయాడు తను కంపనీ మారుతున్నందున ప్రస్తుతం చెస్తున్న పని త్వరగా పూర్తి చేయాల్సిన భారం పడింది. ఏందుకో తెలియదు కానీ రేవంత్ కి మొదటిసారి లైఫులో అలసిపోయినట్లు అనిపించింది. రోజూ ఇంటికెళ్ళే సరికి ఆర్య నిద్రపోతుంటాడు, ఉదయం తను బయలుదేరే సమయానికి వాడు లేవనే లేవడు, తను ఆర్యాతో ఆడుకుని రెండువారాలు పైనే అయ్యింది.రేవంత్ ఇంటికెళ్ళే సరికి శాంతి కిచెన్లో ఏదో సర్దుతుంది, ఆర్య నిద్రపోతూ కనిపించాడు,మద్యాహ్నం పని గొడవలో పడి సరిగా భొంచేయలేదు బాగా ఆకలిగా అనిపించింది, త్వరగా స్నానం చేసి భోజనానికి వచ్చి కూర్చున్నాడు,శాంతి కూడా కూర్చుంది, ఆ రోజు కబుర్లు చెపుతూ , ఆ రోజు వచ్చిన ఉత్తరం గురించి చెప్పింది. భొజనం అయిపోయిన తరువాత ఆ ఉత్తరం తెచ్చి ఇచ్చింది. రేవంత్ ఆ ఉత్తరం వయిపు చూసాడు అది తన తండ్రి దగ్గిరనుంచి వచ్చింది, ఉత్తరం చింపి చదవటం మొదలుపెట్టాడు,అది తను కాలేజీలో రోజుల్లో తను రాసిన ఒక కాలం అది. తన తండ్రి మళ్ళీ దానిని తనకు రాసి పంపాడు.


డబ్బు మనిషి అవసరాలకోసం మనిషి శ్రుష్టించుకున్నది.మనిషి శ్రుష్టించిన డబ్బు మీద మనిషికే అధికారం ఉండాలికానీ, శ్రుష్టింపబడిన డబ్బుకు కాదు.మనం సంపాదించుకునే ఆనందం, సంపాదనే జీవితమనుకునే వారికి క్రుష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు 'చేస్తున్న ఏపనిలోనయినా నిరంతరం ఆనందం పొందటమే జీవితం'.

ఇంత చిన్న విషయాన్ని విస్మరించి జీవితం అనే వర్షాన్ని ఆస్వాదించలేక, డబ్బు సంపాదన అనే చట్రంలో చిక్కుకుని వాడి ఉనికిని మర్చిపోతున్నాడు.ఆస్తి అనేది నువ్వు ఇతరులకి చూపించుకునేది కాదు, నువ్వు అనుభవించేది. రేవంత్ చదవటం పూర్తి చేసాడు,ఒక్కసారి తల తిరిగినట్లయింది,కన్నీళ్ళతో కళ్ళు మసకబారాయి,అప్పటిదాకా ఎదో చీకటిలో ఉన్నట్లు బ్రాంతి కలిగింది,మొదటి సారి తను వంటరి తనాన్ని ఫీల్ అయ్యాడు. తన తండ్రి రాసినదాంట్లో చివరి లైను రేవంత్ మనుసుని తాకింది.మళ్ళీ ఒకసారి చదివాడు ‘ ఏదయినా మన చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, అది చేయి జారిన తరువాత దాని విలువ తెలుస్తుంది, కానీ అప్పుడు అది అందుబాటులో ఉండదు’. ఒక్కసారి పాత రోజులన్ని గుర్తుకు వచ్చాయి, ఎటువంటి వాడు తను ఎలా ఆలోచించేవాడు ఎలా మారిపోయాడు.ఇన్నాళ్ళు తను ఏం మిస్సౌతూ వచాడో ఏం మిస్సవబోతున్నదో అవగతమయింది,తన తప్పుని తనకి తెలియచేసినదుకు మనసులోనే క్రుతజ్ఞతలు చెప్పుకున్నాడు.


ఇండియాలో ఉన్న తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి అందరితో చాలాసేపు మాట్లాడాడు. ఛాలా రోజుల తరువాత రేవంత్ మనసున్న మనిషి లాగా మాట్లాడినందుకు అందరూ చాల ఆనందంగా ఫీల్ అయ్యారు. అందరితో తన నిర్ణయాన్ని తెలియచేసాడు,రామనాధం, సుశీలమ్మ కి ఆ వార్త విన్న రోజు పండగే అయింది....









Sunday, March 1, 2009

ఎంటీవోడు తొంగున్నాడు...... ఇంటరవెల్ కయినా లేస్తాడా!

ఉదయం 6.30 కి నిద్ర లేచి,ఇంట్లొ భార్యకి పనులలో చేయికలిపి, పిల్లలిని స్కూల్ దగ్గిర డ్రాప్ చేసి, అదరా బదరా గా ఆఫీసుకెల్లెసరికి లేటౌతుంది, లేటుగా వచ్చినందుకు సంజాయిషి చెప్పుకుని పని మొదలెట్టేసరికి క్లయింటు దగ్గరనుండి ఫొను వస్తుంది,ఆ పని ముగించుకునే సరికి పిల్లవాడు స్ఖూల్లో ఎదురుచూస్తూ ఉన్న విషయం గుర్థుకు వస్తుంది, పరెగెత్తుకుంటూ వెళ్ళి వాడిని ఇంటిదగ్గిర దిగబెట్టి భొంచేయటానికి టయములేక ఎదో తిన్నామనిపించుకొని పరుగు పరుగున ఆఫీసుకి వచ్చి పని ముగించుకొని వెళ్ళేసరికి సాయంత్రం ఎనిమిది దాటుతుంది......హా!
చూసారా ఇదంతా చెప్పటానికీ నాకు, వినటానికి మీకే ఇంత అలసటగా అనిపిస్తే రోజూ అలా చస్తూ బ్రతుకుతూ ఉన్న మనం ఇంత అలసిపోతూ ఉన్నాం?ఇక ఏదయినా మనకోసం మనం చేయటానికి,చూడటానికి ఇక టైమెక్కడది? అందుకే మన చుట్టూ ఏమి జరిగుతుందో కనీసం చూసో ,వినో ఎంజాయి చేయలేకపొతున్నాం.ఎప్పుడైనా పాత గ్నాపకాలని గుర్తు చేసుకున్నా, ఎప్పుడో జరిగిన సంఘటనలు చదివినా మనం ఎదో తెలియని ఆనందానికి గురౌతూ ఉంటాం. అందుకే ఆనాటి మరుగున పడిన ఒక పాత సంఘటనని మీముందు ఉంచుతున్నాను చదవండి...!
* * *
మనకి తోటరాముడు అన్నపేరు వినగానే జగత్ విఖ్యాతి గాంచిన పాతాళభైరవి సినీమా,అందులో నాయకుడు యన్.టి.ఆర్, మాయల మాంత్రికుడు యెస్ వీ రంగారావు గుర్తుకి వస్తారు, అలాగే అటువంటి గొప్ప సినిమాని నిర్మించిన నాగిరెడ్డి , చక్రపాణి లు గుర్తుకు వస్తారు. పాతాళభైరవి ఇచ్చిన స్పూర్తితో విజయా వారు రెండో జానపద సినిమా కి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి సరిగ్గా ఈ సంఘటన జరిగి 60 సంవత్సరాలు అయింది. పాతాళభైరవి సినిమాకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షక దేవుళ్ళకి ఈ సినిమా ద్యారా ఎక్కడలేని ఆనందాన్ని అందించాలని భావించారు.అనుకున్నట్లుగానే నిర్మాతలకి మంచి స్టోరీ దొరికింది.ఈ సినిమాకు పాతాళభైరవి సినిమాకి అసొసీఎటు దర్సకుడుగా పనిచేసిన కమలాకర్ కామేశ్వరరావు కి దర్సకుడిగా ప్రమోటు చెసారు.ఆ స్క్రిప్టు మీద సంవత్సరం పాటు పనిచేసిన తరవాత వాళ్ళకి నమ్మకం కుదిరింది,ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫ్ బొనాంజా ఔతుందని అందరూ భావించారు.ఈ సినిమాకి " చంద్రహారం " అనిపేరు పెట్టారు, దానికి గాను హీరో యన్.టి.ఆర్ ని, హీరోఇన్ గా శ్రీరంజనీ ని సెలెక్టు చేసారు.
* * *
ఇక కధలోకి వెళితే చందన రాజ్యం మహారాజుకి పుత్ర సంతానం కలగదు, ఒక మహ ముని పూజా ఫలము తో వారికి పుత్ర సంతానం కలుగుతుంది, అతడే చందన యువరాజు.చందనకి యువరాజు ప్రతిరోజూ ఒక కల వస్తుంది ఆ కలలో తన హ్రుదయ రాణి కనిపిస్తుంది, అలా ఒక మంచి రోజు యువరాజు ఆ పల్లె పడుచుని పెళ్ళి చేసుకొని యువరాణి ని చేస్తాడు.అనుకోకుండా ఒక రోజు దేవ కన్య యువరాజు మీద మనసు పారేసుకుంటుంది,తనని పెళ్ళాడమంటుంది,చందన యువరాజు అప్పటికే వివాహితుడయినందున ఆమె కోరికని తిరస్కరిస్తాడు,అంతె ఆ దేవ కన్య యువరాజు దంపతుల మీద కక్ష గట్టి వాళ్ళని ఇబ్బందులకి గురిచేస్తుంది, చివరికి యువరాణి పూజా ఫలముతో యువరాజు కష్టాలు గట్టెక్కి కధ సుఖాంతం ఔతుంది. 1950 చివరి లో షూటింగ్ మొదలయింది, ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడి మనసు దోచేలాగ చిత్రీకరించారు,ఆ సినిమాకోసం దాదాపు 51 సెట్టులు వేసారు, అప్పట్లో ఈ సినిమిమా షూటింగ్ విషేషాలని కధలు కధలుగా చెప్పుకునే వారు.నాగిరెడ్డి, చక్రపాణీ లు వాళ్ళ దగ్గరున్న మొత్తాన్నీ చంద్రహారం సినిమా కోసం వెచ్చించారు.అప్పట్లో ఈ సినిమా షూటింగ్ కోసం జనాలు దొరకటం కష్టమయ్యేది, ఒక సారి రాజ దర్బారు సెట్టింగ్ షూటింగ్ కి 1000 మంది కావలిసి వచ్చింది.అంత మంది జనాలు మద్రాసు మొత్తం గాలించినా దొరకరని అర్ధమయింది.నాగిరెడ్డి,చక్రపాణీలు జనాలని వెతకలేక విజయా స్టూడియొలో ఉన్న అందరిచేత మేకప్ వేయించారు, ఆసమయంలో టీ సప్లయి చేసే వాళ్ళు లేక నిర్మాతలే యూనిట్ సబ్యులకి టీ సర్వు చేసారు.
* * *
అటువంటి కస్టాలెన్నో పడి మొత్తానికి 1952 సినిమా ని పూర్తి చేసారు. రషెస్ చూసిన వాళ్ళందరూ మరొక మహ కావ్యం ఔతుందని భావిచారు.నిర్మాతలయిన నాగిరెడ్డి,చక్రపాణీలు ఆనందానికి అంతే లేదు.1952 ఏప్రిల్ 24 న చంద్రహారం సినిమా రిలీజయింది, ఆ రోజు నిర్మాత నాగిరెడ్డి వాళ్ళ ఊరు లో కూడా సినిమా రిలీజ్ అవటం మూలాన స్వయంగా సినిమా హాలుకెళ్ళి ప్రేక్షకుల స్పందనని చూడాలనుకున్నరు అనుకొవటమే తరువాయి మొదటి షో లో ప్రత్యక్షమయ్యరు.సినిమా మొదలయింది 10 నిమిషాలు గడిచాయి, 20 నిమిషాలు, 40నిమిషాలు కానీ జనాల దగ్గరినుంచి ఎటువంటి రెస్పాన్సు కనపడలేదు, ఈ లోగా పక్కన కూర్చున్న వాళ్ళు ఆ ఇద్దరు నిర్మాతలని గుర్తు పట్టారు, వాళ్ళల్లో ఒకడు లేచి సినిమాలో ఎంటివోడు తొంగుని నిద్దరోతున్నాడు... ఇంటర్వెల్ కయినా నిద్ర లేస్తాడా!.. అని అడిగాడు.. అంతే నాగిరెడ్డి,చక్రపాణీ ముఖాల్లో నెత్తుటి చుక్క కరువయింది.వాళ్ళ అమ్మవాళ్ళ ఇంటికి కూడా పోకుండా సరాసరి మద్రాసు చేరుకున్నరు.వాళ్ళు ఏమనుకొని సినిమాని నిర్మించారో అది పూర్తిగా ప్రేక్షకుడి ఆలోచనలకి వెతిరేకంగా తయారయ్యిందని అర్ధమయింది. చంద్రహారం సినిమా అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్లాపు గా చెప్పుకున్నారు. పాతాళ భైరవి సినిమాకి వచ్చిన డబ్బు, పేరూ చంద్రహారం సినిమాతో కొట్టుకు పొయాయి. ఛంద్రహారం సినిమా నాగిరెడ్డి,చక్రపాణీలకి అక్షరాల 25 లక్షలు నస్టాన్ని కూడగట్టింది. 60 సంవత్సరాల కిందట 25 లక్షలు అంటే ఇప్పటి రోజున అది ఎంత పెద్ద మొత్తమో మనం ఊహించ వచ్చు.
* * *
నాగిరెడ్డి,చక్రపాణీలు ప్రాక్టికల్ గా తెలుకున్నదేమిటంటే మనం చేసే ప్రతి పనిని పట్టుదలతో,అకుంటిత దీక్షతో చేస్తే సరిపోదూ, మనం చేసే పనిలోని మంచిని చెడుని మన కళ్ళతో చూడటమేగాకుండా ఎడుటివారి ద్రుష్టిని బట్టి కూడా ఆలోచించాలి అప్పుడే మనం చేసే ప్రతి పనిని, సక్సెస్ వైపుకి మళ్ళించ వచ్చు.
ఇంగ్లీషులో ఒక వాక్యం ఉంది.... " Think outside the Box".

Sunday, February 15, 2009

అమెరికా – అమెరికా


ఎప్పటినుంచో అనుకుంటున్న డేట్ రానే వచ్చింది.డిసెంబర్ 30 2008.ఆ రోజు కోసం దాదాపుగా పిల్లవాడు ఎక్జాం డేట్ కోసం ఎదురు చుసినట్లు ఎదురు చుస్తూ ఉన్నాను.నిజానికి ఆ రోజే నా ఇండియా ప్రయాణం. నా ప్రాజక్ట్ మేట్…కంగారు పడకండి ఇదేంటి స్కూల్ మేట్,క్లాస్ మేట్ లాగ ప్రాజక్ట్ మేట్ ఎంటా అనుకుంటున్నారా అదేనండీ సహ ఉద్యోగి, నా ట్రిప్ డేట్ గురించి మురళీ రోజూ కౌంట్ డౌన్ చెపుతూ ఉంటాడు, నేను మర్చి పోయినట్లు నటిస్తాను నిజానికి నేను మర్చిపొయేది ఒక్క నిద్రలో మాత్రమె!..
* * *
రెండు వారాల ముందునుంచే మా ఇంట్లో హడావిడి మొదలయింది,నా భార్య లెక్కలువేసి తేల్చి చెప్పింది ఈ ట్రిప్ లొ నెనెంత ఖర్చు పెట్టబొతున్నానో. మా పిల్లలు అప్పుడే బెంగని నటించి దానిలో కసేపు జీవించి, నేను ఇండియా వెల్లినప్పుడుండే బాధని, నేను తిరిగి వచ్చేటప్పుడు తెచ్చే భొమ్మలను ఊహించుకొని ఆనందాన్ని, మొత్తం మీద బాధానందాన్ని పొందారు.ఈ ట్రిప్ కొసం చాలా శ్రమలే పడ్డాం, దాదాపుగా ఆరు సంవత్సరాల తరువాత ఇండియా వెలుతున్నాను. చుట్టాలు, ఫ్రెండ్స్ నా నుండి మంచి గిఫ్ట్లు ఎక్ష్పెక్ట్ చెస్తారని తెలుసు.అందుకె పేరు పేరున వాళ్ళ కి ఏమి కావాలో అడిగి తెలుసుకొని షాపింగ్ చేసాను.అప్పుడర్థమయింది ఇలా కొంటూ పొతే నా జేబు బరువు సరిపోదని.ఈ విషయాలన్ని నా భార్య ముందే ఎలక్కి చెప్పినట్లు చెప్పింది, మనం వినే రకం కాదు కదా.ఎదో నాకు వీలైనంతలొ అందరికీ మంచి గిఫ్ట్లు కొనాలనుకున్నాను.నాకొక ఆలొచన వచ్చింది నా ఫ్రెండ్స్ నన్ను చుడాలనుకుంటున్నరా లేక నే తెచ్చే గిఫ్ట్స్ కొసమే చుస్తున్నరా అని, ఈ ఆలొచన చాల త్రిల్లింగ్ గా అనిపించింది, చుడాలి అక్కడికి వెల్లిన తరువాత.అలా ఎందుకనుకున్నా నంటే ఈమద్యనే నా ఫ్రెండొకడు ఇండియా వెళ్ళొచ్చాడు, వాడు చెప్పినదానిపట్టి ఛుట్టాలు అక్కడున్న వాళ్ళు, వాళ్ళ రిలేషన్స్ అన్నీ మనీ రిలేషన్స్ అయిపొయాయని అంటే మనకొసం కాదు మనదగ్గరున్న దబ్బుకొసం చూస్తున్న్నారని వాడర్ధం,నేను దాన్ని తప్పని ప్రూవ్ చేయాలనుకున్నాను.
* * *
ఉదయం ఎప్పటిలాగానే ఎనిమిదికి నిద్ర లేచాను ..కాదు,కాదు నా భర్య నిద్రలేపింది. ఎందుకో మా ఆవిడకి నేను లేటుగా నిద్రలేవటమే ఇస్టం.ఈ విషయం గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాను, నాకది లేటుగా అర్ధమైది, నేను ఉదయాన్నే లేస్తే తనని పిల్లలతో ఫైట్ చెయనివ్వను,నేను కూడా పిల్లలివయిపే మాట్లాడతాను. అందుకే వీడు నిద్రపొవటమే మంచిదనుకుంటుంది.పైకి మాత్రం ఎలాగూ ఆఫీసులో బాగా వర్కు ఉంటుంది కదా ఎక్కువ నిద్ర కళ్ళకి మంచిదని చెప్పేది. ఈ రోజే నా ఇండియా ప్రయాణం, చాలా ఏళ్ళ తరువాత ప్రయాణమనేమో ఏదో తెలియని బాధ, కాదు భయం …..ఏమో నాకే తెలియటం లేదు. నా మనసు మనస్సు లో లేదు(ఈ స్టేటెమెంట్ ఎక్కడో చదివినట్లు గుర్తు.. మాచ్ అవకపోయినా వాడేసా). అలాగే అఫీసుకు వెళ్ళాను,కాసేపు మెయిల్స్ చూసాను అప్పటికీ అలానే ఉంది పక్కనే కూర్చున్న గంగిసెట్టి ముసి ముసి నవ్వులు నవ్వుతూ రవితో అంటున్నాడు, సింగడు పోక పోక ఇండియా ఫోతే ఇలానే ఉంటుందని. ఆ తరువాత నాకర్ధమయింది ఎన్ని రోజులు, ఎన్నిసార్లు అనుకున్నానో, ఇలా నా ఇండియా ట్రిప్ కోరిక నెరవేరబొతున్నందుకు ఒక్క సారిగా నా మనసు ఆలోచించటం మానేసింది.అందుకే ఈ తెలియని అలజడి. చక చకా ఆఫీసు పనులు ముగించుకొని బయటపడ్డాను.సరిగ్గా 2 గంటలకి గంగిసెట్టి వాన్ ఇంటి ముందు ఆగింది, వస్తునే లగేజి బరువు గురించి అడిగి తెలుసుకొని హడావిడి పెట్టాడు, సమయానికి సమత మంచి కాఫీ సరువు చేసింది, వేడి కాఫీ గొంతులో పడంగానే కాస్త నెమ్మదించాడు. లగేజి కార్లో పెట్టాం, నా భార్య పిల్లలు చాలా హాపీగా సెండాఫ్ చెప్పారు.వాళ్ళు ఆనందంగా సెండాఫ్ చెప్పటం చూసి ఉత్సాహంగా ఏర్పొర్టుకి బయలుదేరాం.
* * *
గంగిసెట్టి వాన్ రొడ్డూమీద వేగంగా పరిగెడుతుంది నా మనసులోని ఆలొచనలు లాగా. పెద్దాయన డ్రైవింగ్ కస్టాన్ని తగ్గించటం కొసం అన్నట్లుగా నేను కబుర్లు మొదలెట్టాను.చాల మంది ఫ్రెండ్స్ కి సందర్భానికి తగ్గట్లుగా మాట్లాడలేరు,నా మూడ్ తెలిసి మాట్లాడటంలొ గంగిసెట్టి ముందు వరసలో ఉంటాడు.ఎదుటి వాళ్ళని సహాయం అడగటం అంటే నాకు ఫ్రాణ సంకటం,అది తెలిసిన వాడుగా నేను అడగకుండానే ఏర్పొర్టు లొ దించుతానని ఛెప్పి వప్పించాడు. దారిలో చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం, అలా మాటల్లో పడేసరికి టయమే తెలియలేదు. ఈలొగా ఏర్పోర్టు రానే వచ్చింది. డ్రాప్ చేసినందుకు క్రుతఘ్నతలు చెప్పి లోపలికి బయలు దేరాను. కొంచం ముందుగా వచ్చానేమో 10 నిమిషాలలొ లగెజి చెకిన్ అయిపోయింది.
* * *
సెకురిటీ చెక్ అయిపోయిన తరువాత ఫ్రాంకుఫొర్ట్ వెళ్ళే విమానం ఉన్న గేటు చూసుకొని అక్కడ తిస్ట వేసాను.ఎంత సేపటికి ఫ్లయిటు టయం అవ్వటం లేదు,గడియారంలో నిమిషాల ముల్లు తాపీగా అప్పుడే భోంచేసి వచ్చినట్లుగా నిదానంగా కదులుతుంది,ఇక చిన్న ముల్లు సరెసరి డెట్రొఇట్ మంచులో కూరుకు పోయిన కారులాగా కదలడానికి ససేమిరా అంటుంది. నాకేమో అసహనం పెరిగి పొతుంది, ఇక లాభం లేదని ఇంటికి ఫొను చేద్దామని బయలు దెరాను.ఫొను రింగవ్వగానే నా కాల్ కోసమే ఎదురు చూస్తుంట్లుగా, మా ఆవిద ఫొను తీసింది నేను ఫోను లొ మాత్లాడుతున్నాను ఎవో ప్రశ్నలు అడుగుతుంది గాని నా ద్యాసంతా ఎప్పుడు విమానం బయలు దేరుద్దాని ఆలోచనలో ఉండి పోయాను.ఒక్కసారిగా ఉలిక్కిపడి తేరుకున్నాను.అవతలనుంచి నా చిన్నకూతురు ఫొను లో తుఫాన్ వచినట్లుగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది, ఎవో కొన్నిటికి సమాధనాలు చెప్పి ఫోను పెట్టేసి తిరిగి గేటు దగ్గరికి వచి కూర్చున్నాను. నా బాధనంతటిని ఆలకించిన దేవతలాగా ఎనఔన్సర్ ఎనఔన్సు చేసింది, ఫ్రాంకుఫొర్ట్ వెళ్ళే ఎర్ర బస్సు…. ఒహ్..సారి ఎయిర్బస్సు బోడింగు మొదలయిందని. చక చకా బాగ్ తీసుకొని ముందు వరసలో అందరికంటే ముందువరసలో నిల్చున్నాను.అంత పంక్చువల్గా ఆఫీసుకు వెళ్ళటం అలవాటుచేసుకొని ఉంటే 'సారీ' అనే పదం నా జీవితంలో చాలా వాడనవసరం వచ్చేది కాదు. అనుకున్నట్లుగానే అందరికంటే ముందుగా ఫ్లయిటు లోకెళ్ళి కూర్చున్నాను, కొంచెం ముందూ వెనుకగా అందరూ వారి సీట్లలో వచ్చి కూర్చున్నారు. ఈ సారి ఇంకే ఆలస్యం లేదు బయలు దేరడమే తరువాయి అనుకున్నాను, పైనున్న పెద్దాయన నా మనసులోమాటని చదివినట్లుగా, పైలెట్ అనౌంచెమెంట్ వినిపించింది,సాంకేతిక లోపం వలన ఫ్లయిటు బయలుదెరడానికి ఇంకా 40 నిమిషాలు పడుతుందని,పయిలెట్ ఫ్లయిటుని సరాసరి రిపేరు సెక్షన్ కి తీసుకుపోయాడు,అప్పుడనుకున్నా 'తానొకటి తలస్తే దైవమొకటి తలచాడంటారు ' ఇదేనేమోనని.చేసేది లేక నా వెంట తీసుకొచ్చిన యం. ఫీ. త్రీ ని ఆన్ చేసాను, ఒల్డ్ ఇలయరాజా పాటలు మధురంగా వినిపిస్తుంటే అలా కళ్ళు మూసుకున్నాను. ఫ్లయిటు ఎప్పుడు రిపేరు అయిందో, ఎప్పుడు బయలుదేరిందో గాని కళ్ళు తెరిచేసరికి ఫ్లయిటు గాల్లో ఉంది.ఈ లోగా ఎయిర్హొస్టెస్ కూల్ డ్రింక్స్ పట్టుకొని వచ్చింది. ఎందుకో రీసన్ తెలియదు గాని చిన్నప్పుడు బస్సులో ప్రయానం చేస్తున్నప్పుడు చూసిన షోడాలు కొట్టేవాడు గుర్తుకు వచ్చాడు, ఒక కలర్ షోడా…..సారి కోక్ అడిగి టీసుకున్నా. అలా రంగుషోడాలమ్మాయి రకరకాల అయిటంలు తెస్తూనే ఉంది,తెచ్చిన ప్రతీ అయిటం తీసుకుంటునే ఉన్నాను. తింటూ, టీవీ చూస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్ననో గుర్తు లేదు కాని పయిలట్ అనౌంచెమెంట్ తో మెలుకువ వచ్చింది.అలా చుస్తుండగానే ఫ్రాంక్ఫొర్ట్ లో దిగిపోయాను. నెత్తిమీద రెండు మూడు కాబిన్ బాగ్ దెబ్బలు తిన్న తరువాత అతి కస్టం మీద ఫ్లయటు లోనించి బయట పడ్డాను.అక్కడ నుండి హయిదరాబాదు వెళ్ళే ఫ్లయిటు ఉన్న గేటు వైపు నడుస్తూ ఉన్నా, దూరం నుంచి ఎవరో పిలుస్తునట్లు అనిపించింది. కాని మనసులో అనిపించింది,ఆరు సంవత్సరాలుగా ఒకే ప్లేసులో ఉంటూ పనిచేస్తూ ఉన్న ట్రాయి లోనే నన్నెవరూ గుర్థుపట్టరు, ఇక్కడెవడుంటాడాని,అదీగాక మా కాఫీ బాచ్ చెంచు, శైలజా,మహెష్, మురళీ కూడా ట్రాయిలోనే ఉన్నరాయ.ఏదో సినిమాలో చుపించినట్లు ఇది బ్రమే అనుకుంటూ ముందుకడుగు వేసా,వెనుకనుంచి నా భుజం మీద ఎవరో చేయి వేసి. ఏరా వీరూ అంటూ పలకరిస్తున్నాడు ఒక్క క్షనం అతన్ని పోల్చుకోలేకపోయాను కానీ అతనికే పరిమితమయిన స్టయిల్ చూసి గుర్తు పట్టాను.నేను బెంగుళూర్ లో జాబ్ చెస్తున్నప్పూడు పరిచయమయ్యాడు,అతనిని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది ,నా జర్నీ లో కలవాలిసిన మంచి మిత్రులు అక్కనుండే మొదలయినట్లుగా అనిపించింది.నా ఎర్ర బస్సు బయలుదేరటానికి చాలా టయిము ఉందటం వలన ఇద్దరం కూర్చుని పాత గ్నాపకాలన్నీ ఒక్క సారి చుట్టి వచ్చాం, ఈ లోగ నా చెకిన్ టయిము అవ్వటం తో అతని దగ్గిర సెలవు తీసుకొని వెళ్ళి ఫ్లయిట్లో కూర్చున్నాను.
* * *
అనుకున్నట్లుగానే ఈ సారికూడా చిట్టచివరి సీట్ అలాట్ అయింది,చేసేది లేక వెనుక నుండి కౌంట్ చేస్తే నాదే మొదటి సీటు కాబట్టి అలా సీటులో సెటిల్ అయ్యాను.ఈ సారి కూడా ఏ జర్మనీ తాతో లేకపొతే చెన్నై అవ్వో నా పక్క సీటులోకి వస్తారని ఎదురుచుస్తూ ఉన్న.ఈ సారికూడా నామనసులో మాటని పైన పెద్దాయన ఇట్టే చదివేసాడు.ఒక చిన్న బాగ్ తీసుకొని, బొడింగుపాస్ చేతిలో పట్టుకొని తన దగ్గిరున్న నంబరుతో ప్రతి సీట్ నంబరు పోల్చి చూస్తూ ఒక అమ్మాయి వస్తూ ఉంది, అలా వెలుతూ నా దగ్గిరకొచ్చి ఆగిపోయింది. అంకున్నా కస్టాలు మొదలయ్యాయని.మామూలుగా తెలిసిన ఆడవాళ్ళతో మాట్లాడటమే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాంటిది పరిచయం లేని అమ్మాయితో కలిసి ఎనిమిది గంటలు కలిసి ప్రయాణం చేయాలి.పది నిమిషాలు మౌనంగా కూర్చున్నాను, చాలా ఇబ్బందిగా అనిపించింది, ఇక నా వల్ల కాలేదు నిశ్శబ్ధాన్ని బ్రేక్ చేస్తే గాని ప్రయాణం ప్రసాంతంగా చెయగలననిపించింది, ఆ ఆలోచన రాగానే మనస్సు కాస్త తేలిక పడింది కానీ ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు,నా బాధ నంతటినీ అర్ధం చెసుకున్నట్లుగా ఆ అమ్మాయే మాటలు కలిపింది.ఊరు, పేర్లు అయినతరువాత కాస్త నమ్మకం కుదిరినట్లుంది ఇంకా మాటలు కంటినూ చేసింది. తను ఎప్పుడు అమెరికా కి వచ్చింది ఎక్కడ చదివింది, ఎక్కడ జాబ్ చేస్తుంది అంతా వివరంగా చెపుతూ ఉంది. ఆ అమ్మాయిది విజయవాడ అట, నేను వినిన దానిని బట్టి విజయవాడ అమ్మాయిలు ఛాలా ధయిర్యవంతులు, ఆ విషయం ఆ అమ్మయిని చూస్తే ఇంతకుముందు తెలియనివారికెవరికైఇనా ఇట్టె బోధపడుతుంది.తను బీ.టెక్ చేసి యం.యెస్ కి వచ్చింది,ప్రస్తుతం ఇప్పుడు జాబ్ చేస్తుంది.కానీ ఆ అమ్మాయి ముఖం లొ ఇండియా వెలుతున్నందుకు ఉండవలిసిన ఆనందం కనిపించలేదు అదే విషయాన్ని ఆ అమ్మయిని అడిగాను, అప్పుడు చెప్పింది అమెరికా మాంద్యం యేక్క ఇంపాక్టు తనమీద కూడా పడ్డదని తన జాబ్ పోయిందనీ మల్లి ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదంటూ వాపోయింది. ఇదంతా విన్న తరువాత ఆ అమ్మాయి మీద మంచి అభిప్రాయం కలిగింది, జాలి గూడా వేసింది. ఈలొగా షొడాలమ్మాయి వచ్చింది, నాకు ఎప్పటినుంచో ఫ్లయిటులో వెలుతున్నప్పుడు వైను తాగాలని ఒక చిన్న కొరిక ఉంది, కానీ ఇన్ని కస్టాలు ఉన్న అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇక వైను తాగాలనిపించలేదు అందులోనూ పెద్దవాడిని హుందాగా ఉండాలని నిర్నయించుకున్నాను.షొడా లమ్మాయినడిగి ఆరంజ్ జూసు తీసుకున్నాను, పక్కన అమ్మయి కూడా కొక్ అడిగి తీసుకుంది.కొద్దిసేపటి తరువాత ఇడ్లీలమ్మే బండివాడు వచ్చాడు ఒక వేళ ఆ అమ్మాయి వెజిటరియన్ అయితె నేను చికెన్ తింటుంటె బాగుండదని నాకెంతో ఇస్టమయిన చికెన్ మీల్ వద్దని వెజు మీల్ అడిగి తీసుకున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను ఫాలో అయింది,ఆ అమ్మయి వెజు తీసుకోవటం చూసి నా గెస్సు కరెక్ట్ అయినందుకు ఆనందంగా నిద్రలోకి జారుకున్నా.ఎవరో తట్టి లేపుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసే సరికి ఎదురుగా షొడాలమ్మాయి ఎం కావాలని అడుగుతుంది ఎమి లాభం ఎలాగూ వైను తీసుకొలేను, ఆ ఆలొచన రాగానే ఒక్కసారి నీరసంగా అనిపించింది చేసేది లేక ఈ సారి వెరైటీగా ఉంటుందని ఇందాక ఆ అమ్మాయి ఆర్డర్ చేసిన కోక్ ఆర్డెర్ చెసా. ఇక ఆ అమ్మాయి వంతు వచ్చింది, అప్పటికే ఆ అమ్మయికి అర్ధమయిందనుకుంటా, వీడు కన్నాంబకెక్కువ కాంచనమాలకి తక్కువని రెడ్ వైను ఆర్డర్ చేసింది ఆ వెంటనే చికెన్ మీల్ ఆర్డర్ చేసింది, అంతే అదిచూసి మళ్ళీ నాకు నిద్ర ముంచుకొచ్చింది.
* * *
ఒక పెద్ద కుదుపుతో ఫ్లయట్ ఆగిపోయింది, వచ్చెసాం ఇందియా వచ్చేసాం కాబిన్ బాగ్ తీసుకొని బయట పడ్డాను, అదే ఊపులొ బాగేజి సెక్షన్ కెల్లి కస్టంసు దగ్గిర నా నా కస్టాలు పడి ఆత్రంగా బయటకి పరెగెత్తాను, దూరం నుంచి విష్ చేస్తూ చిన్నా,ఫణి,సుబ్బా పరెగెత్తుకుంటూ వస్తున్నారు.వాళ్ళ పలకరింపులు చుట్టూ గుమిగూడిన జనాన్ని చుస్తుంటె అనిపించింది ఖచ్చితంగా ఇలా ఎప్పటికి అమెరికాలొ జరగదని.నిజంగా ఆ కోలహలం, జనాల సందడి అమెరికా జీవితంలొ మిస్సౌతూ వస్తున్నాం. ఈ లోగా చిన్నా కారు పిలిపించాడు, అమెరికాలొ పెద్ద పెద్ద కారులు చుదటం వల్లేమొ మేమెక్కిన కారు చాలా చిన్నదిగా అగ్గెపెట్టె లాగా అనిపించింది.మెమెక్కటమే ఆలస్యం డ్రైఇవర్ వాడికే అలవాటైన రోడ్డు మీద అగ్గెపెట్టె కారుని పరిగెత్తించ్చాడు. మేము ఇంటికి చేరుకునే సరికి అంతా సిద్దంగా ఉంది, దెసెంబర్ 31 రాత్రి సంబరాల కేకు నాకు వెల్కం చెపుతున్నట్లు రడీగా ఉంది.ఆనందంగా కేకు కట్ చేసి విషెస్ చెప్పుకున్నాం. కొన్ని ఏళ్ళ తరువాత వాళ్ళందరినీ చుస్తున్నాను, నా ఆనందానికి అవధులు లేవు, అలా తెల్లవార్లూ మాట్లాడుతూ కూర్చుండిపోయాం. ఇందియా రోడ్ల మీద నడిచి చాలా ఏళ్ళైందేమో ఎప్పుడు బయటకి పొదామా అనిపిస్తుంది.బ్రెషప్ అయి ముగ్గురం కాఫీ కి బయలుదెరాం,జనవరి నెల ఉదయాన్నే అలా రోడ్డు మీద వెలుతుంటే,మనసుకి చాలా హాయిగా అనిపించింది,కొద్దిగా పొగమంచు చల్లగా గాలితాకుతుంటె నాకెంతొ ఇస్టమైన గీతంజలీ పాట గుర్తుకొచ్చింది. చిన్నా స్పెషల్ టీ ఆర్డర్ చేసాడు,అలా రోడ్డుమీద నిలబడి టీ తాగి చాలా రొజులయిందేమో టీ చాలా మధురంగా అనిపించింది. స్నానాలు అయిన తరువాత షాపింగ్ కి బయలు దేరాం,దాహంగా అనిపిస్తే దగ్గిరలొ బొండాలోడి దగ్గిరికి వెళ్ళి ముగ్గురం బొండా తాగాం, అక్కడ కొబ్బరి బోండా రేటు విని షాక్ అయ్యాను, నాకు తెలిసి ఒక్క కొబ్బరి బోండం ఖరీదు రెండు రూపాయలు, కానీ వాడు చెప్పిన రేటు పన్నెండు రూపాయలు, ఆరు సంవత్సరాలలో ఇంత మార్పా అనిపించింది. ఇటువంటి షాకులకి మెంటల్గా సిద్దపడాలనుకున్నాను. ఆ మహసముద్రం లాంటి ట్రాఫిక్ ని ఈదుకుంటూ షాపింగ్ చేసాం,రాత్రి ఎవ్వరూ సరిగా భోంచేయలేదేమో అందరికీ ఆకలి దంచేస్తుంధి వేరే ఆలొచన లేకుండా ఒక మంచి హొటల్ చూసుకొని అక్కడ తిస్ట వేసాం.ఇండియా వంటకాల వాసనకి నా ఆకలి రెట్టింపయింది, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకెంతొ ఇస్టమైన హైదరాబాద్ ధం బిరియానీ ఆర్దర్ చేసాము.మహాప్రభో బిరియానీ ఎంత రుచిగా ఉందంటే కేవలం బిరియానీ కోసమే ఇందియాలొ ఉండిపోవాలనిపించింది. మేము షాపింగ్ ముగించుకొని ఇంటికి చేరేసరికి దం గాడు, కుమర్ గాడు మాకొసమే ఎదురుచూస్తున్నరు. ఈ ఆరు సంవత్సరాలలొ వాళ్ళ రూపు రేఖలు పూర్తిగా మారాయనిపించింది.చిన్నా వాళ్ళింట్లోనే భొజనాలు కానించి ఫణీ, నేను నరసరావుపేట కి బయలుదేరాం.నాకు బాగా అలసటగా అనిపించి బస్సు బయలుదేరగానే నిద్రకి రెడీ అయ్యను యం.పి.3 లొ నుంచి రైటో, లెఫ్టో అంటూ పాట వినిపిస్తూ ఉంటే వింటూ నిద్రలోకి జారుకున్నా. బస్సు కండక్టర్ పేట.., పేట అన్న అరుపులతొ మెలుకువ వచ్చింది, చూస్తుండగానే మేము దిగవలసిన స్టాపు వచ్చింది.లగేజి తీసుకొని దిగేసరికి ఎదురుగా మా బావగారు కారుతో రడీ గా ఉన్నారు.కారు బయలుదేరింది, నాకెంతో పరిచయమయిన రొడ్లమీద అలా అన్నీ గుర్తు పట్టడానికి ప్రయత్నించి ఫేయిల్ అయ్యను, అంతా మారిపోయింది నేను వింటూ ఉన్నది నిజమనిపించింది. నిజానికి మాది చిన్న పల్లెటూరు అక్కెడే ఎంతో మార్పు కనిపించింది.ఇంటికి వెల్లేసరికి నా రాక కొసం అంతా ఎదురుచుస్తూ ఉన్నారు, అమ్మ,నాన్న ఊరినుంచి వచ్చిన అక్క, చెల్లి వాళ్ళ ఫామిలి అందరినీ చాలా సంవత్సరాలుగా చుడకపొవటం వల్లేమొ వాళ్ళని చూడగానే నా కళ్ళళ్ళో నీళ్ళు నిండాయి, అది ఒక్క క్షణమే ఆ తరవాత వాళ్ళ పలకరింపులతో అంతా కొలహలంగా మారిపోయింది. నా ఆరు సంవత్సరాల అమెరికా జీవితంలొ అటువంటి మధురమయిన సంఘటన ఒక్కటీ ఆ క్షణంలో గుర్తుకు రాలేదు…..నాకు ఆచ్చర్యమనిపించింది!. అలా కొన్ని గంటలపాటు ఎవో ముచ్చట్లు జరుగుతూనే ఉన్నాయి మధ్య మద్యలో అత్త వరుస, పిన్ని వరుసయిన వాళ్ళు వచ్చి చూసి వెలుతున్నరు, ఈ లొగా స్నేహబ్రుందం రానే వచ్చింది, అందరి కళ్ళళ్ళో తెలియని ఆనందం అందరం కలిసి అమ్మచేతి కమ్మని కాఫీ తాగాం.నేను కొత్తగా వచ్చాను గాని వాళ్ళకి ఎప్పుడూ చేసే పని ఉంటుందికదా, మళ్ళీ కలుస్తామని చెప్పి అంతా వెళ్ళిపొయారు. చిన్నప్పటి నుంచి హనిమి గాడికి నెనంటే కాస్త ప్రేమెక్కువే,మేము చదువుకొనేటప్పటినుంచే నెనేదో సాధిస్తానని నమ్మినోడు, ఇవాళ నేను వచ్చినందుకు వాడికి చాలా ఆనందంగా ఉంది. కానీ వాడికళ్ళళ్ళొ ఎక్కడో చిన్న అసంత్రుప్తి కదలాడింది, బహుసా వాడు కూడా ఇలాగ చదవలే కపొయినందుకేమో. కొద్ది సేపటి తరువాత చెల్లి పిల్లలు కాలేజే నుంచి వచ్చారు రాగానే నా ఆసీర్వాదం కొరి నమస్కరించారు, వాళ్ళ వినయ విధేయతలు చూసి అనిపించింది అచ్చు వాళ్ళమ్మ గుణాలే వచ్చాయని. ఇదంతా మా నాన్న దూరంగా కూర్చొని గమనిస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఇటువంటి ఆనంద క్షణాలు మిస్సయినందుకు బాధని గుర్తుచేసుకుంటూనే, ఈక్షణం లో పొందుతున్న ఆనందానికి సంతొషంగా కనిపించాడు.అమ్మ చేతి వేడి వేడి ఇడ్లీలు తిని సిటీకి బయలుదేరాను.
* * *
అలా రెండురోజులు గడిచాయి, ఉదయాన్నే ఊళ్ళో ఉన్న బంధువులని కలవటం లంచ్ తరవాత పేటకి వెళ్ళి ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టటం. మేమంతా ఎదురుచూస్తున్న సంక్రాంతి సెలవలు రానే వచ్చాయి. వాటితొపాటు ఎక్కడెక్కడో చదువుతున్న స్టూడెంట్లని, హైద్రాబాదులో జాబ్ చేస్తున్న కుర్ర వాళ్ళని కూడా ఊరికి పట్టుకొచ్చాయి. వాళ్ళ రాకతో ఒక్కసారిగా ఊరిలొ ఉత్సాహం ఉరకలేసింది, అప్పటివరకు నెమ్మదిగా జరుగుతున్న పనులలో వేగం పెరిగింది, వాళ్ళందరి ముచ్చట్లతో నేనుకూడా బిజీ అయిపొయ్యాను. కుర్రవాళ్ళు సంక్రాంతి పండగ సందర్భంగా జరగాలిసిన కార్యక్రమాల ప్రణాలిక చేయటంలో మునిగిపోయారు.ఎన్నొరోజులనుంచి సంక్రాంతి పండుగకోసం ఎదురుచుస్తున్న ఊరి ఆడబడుచులు కుటుంబసమేతంగా వచ్చిచేరారు. ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు, పనులుచేసుకునే కుర్రవాళ్ళు ఈసారి త్వరగా పొలం పనులు అయిపోవటంతో అందరితో బజార్లు కళ కళ లాడాయి. ఇటువంటి పల్లె వాతావరణం లో గడిపి 15 సంవత్సరాలు పయినే అయింది , అందుకేనేమో అక్కడ కనిపించిన ప్రతివక్క సన్నివెశాం నా మనసుకి హత్తుకున్నట్లు అనిపించింది .అందుకేనేమో అందరూ అంటుంటారు “పల్లెల్లో అభిమానాలు, ఆప్యాయతలు ఉంటే – పట్టనాలలో ఆర్భాటాలు, అగచాట్లు” ఉంటాయని.
* * *
మేమందరం ఊరికి వచ్చిన సందర్భంగా ఊళ్ళో ఉన్న కుర్ర వాళ్ళందరినీ ఒక చోట సమావేస పరిచారు.మేము తలపెట్టబొతున్న ట్రస్టు గురించి, కమిటీ మెంబర్లు కూలంకుషంగా వివరించి చెప్పారు, దానికి మాత్రుభూమి చారిటబుల్ ట్రుస్ట్ అని పేరుపెట్టి, ఆందరి నిర్నయం తో ఊర్లో మంచినీటి కుళాయి(వాటెర్ పుఎరిఫికషన్ పధకం) ఎర్పాటుకి నిర్నయించారు,పిల్లల చదువుకి ప్రయివేటు, అలాగే బ్లడ్ టెస్టులు, కళ్ళ పరీక్షల ఎర్పాటుకి తీర్మానించారు. ఊరికి జరగబోయే మంచిని ఊహించికొని అక్కడ ఉన్న అందరి మొహాలలో ఆనందం వెల్లివిరిసింది. దానిలో భాగంగా ట్రస్టు సభ్యులు సంక్రాతి వేడుకలు ఘనంగా నిర్వహించి చదువుకున్న పిల్లలికి , కుర్రవాళ్ళకి బహుమతి ప్రధానం చేసారు. ఊరి పెద్దలు అంతా కలిసి చందాలు వసూలు చేసి రామాలయము, పిల్లలికి చదువుకోవటానికి బడి, ఫేపరు చదుకోటానికి పెద్దలికి గ్రంధాలయము కట్టించ్చారు. మంచి రోజులు వస్తే అంతా మంచే జరుగుద్ది అనటానికి నిదర్సనంగా ప్రభుత్వం ఊరిలో సెమెంటు రోడ్డులు వేయించ్చారు. ఈన్ని విధాలుగా అభివ్రుధ్ధి చెందుతున్న మా ఊరిని చూసి సంత్రుప్తిగా అమెరికాకి తిరిగి ప్రయానమయ్యాను.
* * *
హైదరాబాదు ఏర్పొర్టు లో అడుగు పెట్టే సరికి అప్పుడే..… ఆ అమ్మాయి టాక్సీ దిగుతుంది, అంతే ఒక్కసారిగా నాకు నిద్ర ఆవహించింది..